రఘురామ-పీవీ సునీల్ వివాదంలో బిగ్ ట్విస్ట్ లు..! ఏం జరగబోతోంది ?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకూ, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ కూ మధ్య సాగుతున్న వార్ తాజాగా కీలక మలుపులు తిరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ కస్టడీలో తనను హింసించిన వ్యవహారంలో పీవీ సునీల్ పై చర్యలకు పట్టుబట్టి తాజాగా విచారణకు వెళ్లేలా చేసిన రఘురామరాజుకు అనంతరం బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు షాకిచ్చింది. దీంతో ఈ కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీవీ సునీల్ సోషల్ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది.
Save the state pic.twitter.com/JLRid0cizg
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) December 20, 2025
గతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వ్యవహారంలో తనను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజును సైతం పదవి నుంచి తప్పించాలని ఐపీఎస్ పీవీ సునీల్ కోరుతున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు భగ్గుమంటున్నారు. ఇదే అదనుగా పీవీ సునీల్ తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. రఘురామను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఇందులో వాస్తవాలు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. దీంతో రఘురామ రూటు మార్చారు.

420 రఘురామకృష్ణ రాజు అరెస్ట్ కాబోతున్న CBI పెట్టిన చీటింగ్ కేసు FIR. ₹ 945 కోట్లు కాజేసిన గాజ దొంగ రఘురామకృష్ణ ఆయన రాజు ఆనని సిబిఐ కేసు . RRRకుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) December 20, 2025
సుప్రీం కోర్టు RRR ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి… pic.twitter.com/FPoo37qhk2
అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలను ఉల్లంఘించి తనపై సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతున్న పీవీ సునీల్ కుమార్ ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు తాజాగా డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు. ఇందుకు ఆధారంగా పీవీ సునీల్ ఎక్స్ లో పెట్టిన పోస్టులు, వీడియోల్ని సమర్పించారు. దీంతో ఇప్పుడు పీవీ సునీల్ పై చర్యలు తీసుకునే విషయంలో బంతి డీజీపీ చేతుల్లోకి వెళ్లింది. అయితే పీవీ సునీల్ కుమార్ కు మద్దతుగా ఇప్పటికే దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంటే ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకునేందుకు డీజీపీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

నా కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో ఏపీసీఐడీ మాజీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ చెప్పిన సమాధానాలపై ప్రముఖ దినపత్రిక "తెలియదు.. గుర్తులేదు!" అనే పేరుతో ప్రచురించిన కథనం, నా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు "మీడియా సమావేశం". pic.twitter.com/1KbK22vYvT
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) December 16, 2025
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత జగన్ పై తిరుగుబాటు చేసి రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత కూటమి తరఫున పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజా వివాదాలతో ఆయనపై చర్యలు తీసుకుంటే ఓ తలనొప్పి, వదిలేస్తే మరో తలనొప్పి అన్నట్లుగా ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications