నిండు ప్రాణం బలి: సకాలంలో స్పందించని సిబ్బంది, ఊపిరాడక రోగి మృతి
ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వస్తే సిబ్బంది పట్టించుకోలేదు. ఓపీ రిజిష్టర్లో పేరు నమోదు చేశారు.. కానీ వార్డులోకి రానీయలేదు. దీంతో అతను ఊపిరాడక చనిపోయాడు. ఈ హృదయ విదారకర ఘటన అనంతపురం జిల్లా ఆస్పత్రిలో జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చెట్టంత మనిషి చనిపోయాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ధర్మవరానికి చెందిన రాజు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దవాఖానకు తీసుకొచ్చారు. అయితే సిబ్బంది ఓపీ రిజిస్టర్లో పేరు రాసుకున్నారు. కానీ వార్డులోకి రానీయలేదు. దీంతో ఉదయం 3 గంటల నుంచి బయటే ఉండాల్సి వచ్చింది. చూడాలని కుటుంబసభ్యులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయి.. చనిపోయాడు.
Recommended Video
రాజుకు వెంటనే వైద్యం అందించి ఉంటే బతికేవాడు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రాజు మృతిపై మీడియా వార్త ప్రసారం చేయడంతో.. మృతదేహాన్ని స్ట్రెచర్పై మార్చురీ గదికి తరలించారు. రోడ్డుపై ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. అనంత ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications