హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చూశారని బాత్‌రూం నాలాలో 7 కిలోల గోల్డ్ పడేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాదు విమానాశ్రయానికి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 7 కిలోల బంగారాన్ని వెంట తీసుకువచ్చాడు. అధికారులు ఆ విషయాన్ని గుర్తించడంతో ఆ ప్రయాణికుడు బంగారాన్ని బాత్‌రూమ్ నాలాలో పడేశాడు. దీంతో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని వెతికారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తిరుమల కొండపై మందు బాబుల వీరంగం

Man held at Shamshabad air port with gold

తిరుమల కొండపై మందు బాబులు వీరంగం సృష్టించారు. కొండపై ఉన్న ఓ దుకాణంలోని వ్యక్తి తప్పతాగి ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.

ఈ ఘటనలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని అడ్డుకోబోయేందుకు వెళ్లిన సమీప దుకాణాలపైనా మందు బాబులు దాడి చేశారు. దుకాణంలోని వస్తువులను పూర్తిగా ధ్వంసం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఐపిఎల్ మ్యాచుల పైన బెట్టింగుకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ముగ్గురు ముగ్గురు వ్యక్తిల నుండి 44 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాపులు వారు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Man held at Shamshabad air port with gold
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X