వదినతో అక్రమ సంబంధం: కుటుంబ సభ్యులే చంపారు
ఈ క్రమంలో జాఫర్ భార్య గొడవపడి పుట్టికి వెళ్లి తమవారితో కలిసి వచ్చి మంగళవారం అర్థరాత్రి భర్తతో గొడవకు దిగింది. ఈ క్రమంలో వారందరూ జాఫర్పై బండరాయితో దాడి చేశారు. తర్వాత 108 వాహనంలో జాఫర్ను ఆస్పత్రికి తరలించి వారంతా పరారయ్యారు. చికిత్స పొందుతూ జాఫర్ బుధవారం ఉదయం మరణించాడు. పోలీసులు కేసున నమోదు చేసుకుని కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
అప్పు చెల్లించనందుకు హత్య
జామీన్ ఉండి కూడా ఇప్పంచిన డబ్బును తిరిగి చెల్లించడం లేదనే ఆగ్రహంతో తాపీ మేస్త్రీని మిత్రుడే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్కు చెందిన తిప్పరాజు వెంకటేష్ కొంపల్లిలో ఉంటూ మేస్త్రీ పని చేస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఇటీవల మిత్రుడు తిరుమల్ ద్వారా ఫైనాన్స్లో 4 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించలేదు. ఇంటికి వెళ్లినా దొరకడం లేదు. దీంతో మంగళవారం రాత్రి ఇంటి వద్దే ఉన్నాడని సమాచారం అందుకుని తిరుమల్ తన సోదరుడు నర్సింహులు, మరికొంత మందితో కలిసి వెళ్లి అప్పు కోసం నిలదీశారు.
డబ్బులు లేవని వెంకటేష్ చెప్పడంతో గొడవకు దిగి వెళ్లిపోయారు. తిరుమల్ అర్థరాత్రి తిరిగి వచ్ిచ వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్ పొట్ట, ఛాతీ భాగాల్లో పొడిచాడు. దీంతో అతను మరణించాడు.