చాక్లెట్ ఇస్తానని జూనియర్ ఆర్టిస్ట్ రేప్, గుండుగీసి(ఫోటో)
హైదరాబాద్: ఆరేళ్ల బాలికను ఓ కామాంధుడు చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి, గుండు గీశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఫిలింనగర్కు చెందిన నర్సింహ జూనియర్ ఆర్టిస్ట్. అతడికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో రోజుంతా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు.
మంగళవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ వచ్చిన పాపను గమనించిన స్థానికులు విషయం తెలుసుకున్నారు.
ఇంతలో నర్సింహ అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఉదయం తిరిగి ఏం తెలియనట్టు వచ్చిన అతడ్ని స్థానికులు పట్టుకుని చితకబాదారు. చెట్టుకు కట్టేసి అరగుండు గీశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.