కెసిఆర్పై దండయాత్ర: మందకృష్ణ, మోత్కుపల్లి బస్సు యాత్ర
హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి టి. రాజయ్యను అవమానకరంగా పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు.
తెలంగాణలో అత్యధిక స్థానంలో ఉన్న మాదిగలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాదిగ, మాలలు లేని మంత్రివర్గం ఒక్క కేసీఆర్దేనని మందకృష్ణ విమర్శించారు. కేసీఆర్కు వ్యతిరేక పోరాటంపై శుక్రవారం వరంగల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

దళితులు లేని కేబినెట్ కే సీఆర్దేనని మందకృష్ణమాదిగ ఆరోపించారు. రాజయ్యను అవమానకరంగా తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక శాఖలోను దళితులకు ప్రాధాన్యం లేదని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో బస్సుయాత్ర చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేబినెట్లో దళితులకు చోటు కల్పించకపోవడం, ఏ తప్పూ చేయని రాజయ్యను బర్త్రఫ్ చేయడం వంటి కేసీఆర్ చర్యలకు నిరసనగా, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మోత్కుపల్లి బస్సుయాత్ర చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications