కెసిఆర్పై దండయాత్ర: మందకృష్ణ, మోత్కుపల్లి బస్సు యాత్ర
హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి టి. రాజయ్యను అవమానకరంగా పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు.
తెలంగాణలో అత్యధిక స్థానంలో ఉన్న మాదిగలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాదిగ, మాలలు లేని మంత్రివర్గం ఒక్క కేసీఆర్దేనని మందకృష్ణ విమర్శించారు. కేసీఆర్కు వ్యతిరేక పోరాటంపై శుక్రవారం వరంగల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

దళితులు లేని కేబినెట్ కే సీఆర్దేనని మందకృష్ణమాదిగ ఆరోపించారు. రాజయ్యను అవమానకరంగా తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక శాఖలోను దళితులకు ప్రాధాన్యం లేదని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో బస్సుయాత్ర చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేబినెట్లో దళితులకు చోటు కల్పించకపోవడం, ఏ తప్పూ చేయని రాజయ్యను బర్త్రఫ్ చేయడం వంటి కేసీఆర్ చర్యలకు నిరసనగా, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మోత్కుపల్లి బస్సుయాత్ర చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications