టీడీపీలోకి కాంగ్రెస్ నేతల క్యూ, ప్రతిభ అసంతృప్తి: ఊరుకోం.. కాంగ్రెస్తో దోస్తీపై అయ్యన్న
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి, మాజీ చీఫ్ విప్ కొండ్రు మురళి అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు నేతలు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

చంద్రబాబుతో ఉగ్రనరసింహా రెడ్డి భేటీ
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఉగ్రనరసింహా రెడ్డి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై మంతనాలు జరిపారు. స్థానిక కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుతోను టిడిపి అధినాయకత్వం చర్చించింది. పార్టీలో కొత్త చేరికలతో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని భావిస్తోంది.

కళాతో కొండ్రు మురళి
మరోవైపు, కొండ్రు మురళి ఇప్పటికే ఏపీ పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. ఆయన రాజాం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కొండ్రు మురళి రాకను మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నారు. వీరి భాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రతిభా భారతి ఆవేదన
కొండ్రు మురళిని పార్టీలోకి తీసుకొని రావడం సరికాదని, ఇందుకు తాను అంగీకరించేది లేదని ప్రతిభా భారతి పార్టీ అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. అయితే ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టారు. ఆమెను బుజ్జగించి కొండ్రును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్తో చేతులు కలిపితే ఒప్పుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపితే తాను ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకునేది లేదని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు గురువారం అన్నారు. కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదన్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications