టెక్కీగా పనిచేసి, పర్వతారోహణకు వెళ్లి చిలీలో మృతి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు మస్తాన్ బాబు కథ విషాదంతమైంది. అర్జెంటీనాలోని కొండ ప్రాంతాల్లో మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ఆరు వేల అడుగుల ఎత్తున అతని మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.
మార్చి 25వ తేదీన పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణంలో అతను చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా సహాయక బృందాలు ఏరియల్ సర్వే నిర్వహించాయి.

మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వేలో గుర్తించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం గ్రామానికి చెందినవాడు. కుమారుడి జాడ తెలియకపోవడంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో ఉన్న ఆమె ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఆమె కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిపోయింది.
కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న మస్తాన్ ఖరగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఆయన పర్వతారోహణం మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇప్పటివరకు ఏడు ఖండాల్లో పర్వతాలు ఆధిరోహించి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. చిలీలో మస్తాన్ అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications