ఏపీలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు: చింతా సంచలనం, గోరంట్లపై హర్ష
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుగరాజుపట్నం ఓడరేవు నిర్మాణం కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి చొరవ చూపడం లేదని ఆరోపించారు.
సొంతింటి కలను నిజం చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో చింతా మోహన్ పాల్గొన్నారు.
గోరంట్లపై హర్ష కుమార్ మండిపాటు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశానవాటిక నిర్మించాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీ లోపు చంద్రబాబు దీని పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పాత్రను రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.