చెప్పుతో కొట్టాలి: జగన్-ముద్రగడలపై ఊగిపోయిన అచ్చెన్నాయుడు
కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదన్నారు.
అమరావతి: కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో జనాల మధ్య కులచిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకుంటారన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని, అబద్దాలు చెప్పే వారిని చెప్పుతో కొట్టాలన్నారు.
ముద్రగడను జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ప్లీనరీలో జగన్ ఒక్క మాట చెప్పలేదని గుర్తు చేశారు.

డబ్బున్న వారికి మంత్రి పదవులను చంద్రబాబు ఇవ్వడం లేదని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి, ప్రజల కోసం పని చేసిన వారికే పదవులు ఇస్తున్నారన్నారు.
నంద్యాలకు తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని కళా వెంకట్రావు వేరుగా అన్నారు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని, ఆయన రాజకీయం కోసమే ఉద్యమిస్తున్నారన్నారు. ముద్రగడ మర్మాన్ని కాపులు గుర్తించాలన్నారు. అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తే తప్పేమిటన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications