చెప్పుతో కొట్టాలి: జగన్-ముద్రగడలపై ఊగిపోయిన అచ్చెన్నాయుడు
కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదన్నారు.
అమరావతి: కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో జనాల మధ్య కులచిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకుంటారన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని, అబద్దాలు చెప్పే వారిని చెప్పుతో కొట్టాలన్నారు.
ముద్రగడను జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ప్లీనరీలో జగన్ ఒక్క మాట చెప్పలేదని గుర్తు చేశారు.

డబ్బున్న వారికి మంత్రి పదవులను చంద్రబాబు ఇవ్వడం లేదని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి, ప్రజల కోసం పని చేసిన వారికే పదవులు ఇస్తున్నారన్నారు.
నంద్యాలకు తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని కళా వెంకట్రావు వేరుగా అన్నారు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని, ఆయన రాజకీయం కోసమే ఉద్యమిస్తున్నారన్నారు. ముద్రగడ మర్మాన్ని కాపులు గుర్తించాలన్నారు. అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తే తప్పేమిటన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications