ఖమ్మంలో ఘోరం:అదృశ్యమైన బాలుడు శవమయ్యాడు
ఖమ్మం: జిల్లాలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడు హత్య చేయబడ్డాడు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని రఘునాథ పాలెం వద్ద శవమై కనిపించాడు. హైదరాబాద్ లోని చింతల్ బస్తీకి చెందిన కిషోర్, చంద్రికలు దంపతులు. వీరి ఐదేళ్ల కుమారుడు నిషాంత్(7).
ఖమ్మం జిల్లాలో చంద్రిక అక్క దేవిసాయి నివాసముంటుంది. ఆమె గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతూ స్థానికంగా ఉన్న బోడేపూడి నర్సింగ్ హోంలో చేరింది. అయితే ఆమెను చూసేందుకు మూడు రోజుల క్రితం కిషోర్, చంద్రికలు తన కుమారుడి తోపాటు ఖమ్మం వచ్చారు.
ఐతే ఆస్పత్రికి వెళ్లి తన అక్క దేవీసాయి రూమ్ లోకి చంద్రిక ఆమెతో మాట్లాడుతుండగా 11వ తేదీన ఆస్పత్రిలో అదృశ్యమైన నిషాంత్ హత్యకు గురయ్యాడు. దీంతో కిషోర్, చంద్రికలు టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో కిడ్నాపైన బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు
విశాఖలో కిడ్నాపైన దామోదర్ (10) ఆచూకీ కోసం 4 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. దామోదర్ నాలుగు రోజుల క్రితం కిడ్నాపైన విషయం తెలిసిందే. దుండగులు బాలుడిని కిడ్మాప్ చేసిన రోజు రాత్రి తండ్రికి ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడటంతో కిడ్నాపర్ల నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.