విద్యార్థి అదృశ్య ఘటన విషాందాంతం...తల ఉరికి వేలాడుతూ..శరీరం కుళ్లిపోయి...కుప్పకూలిన కుటుంబ సభ్యులు..
తిరువూరు: తెలుగు రాష్ట్రాలను వరుస హత్యలు, ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఇదే కోవలో సరిగ్గా నెల రోజుల క్రితం అదృశ్యమైన కృష్ణా జిల్లా ఇంటర్ విద్యార్థి ఉదంతం చివరకు విషాదాంతమైంది. తల్లి మందలించిందనే చిన్న కారణంతో ఆ ముద్దుల కొడుకు సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పట్టుమని పదిహేడేళ్లు కూడా నిండకుండానే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చాడు. తమ గారాల పట్టి తనువు చాలించాక మృతదేహం పరిస్థితి చూసి కన్నవాళ్లు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
ఈ విషాద ఘటన కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవి... తిరువూరు మండలంలోని గానుగపాడుకు చెందిన కొంగల సంజీవరావు, రేణుకల రెండో కుమారుడు కొంగల ఆకాశ్ తిరువూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
ఆకాశ్ నవంబర్ నెలలో తనకు ఒంట్లో బాగాలేదంటూ కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నాడు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో చదువుకోకుండా ఇంటి దగ్గర ఉంటే ఎలా అని తల్లి మందలించింది. దీంతో అదే నెల 17 తేదీన కాలేజ్ కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన ఆకాశ్ సాయంత్రానికి ఇంటికి తిరిగిరాలేదు.
{photo-feature}