వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రంగు పడింది: ‘ఆంధ్రజ్యోతి’పై ఎమ్మెల్యే ‘ఆళ్ల’ పరువునష్టం దావా!
ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు.
అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారంటూ ఆయన నాంపల్లి కోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఆగస్టు ఒకటో తేదీన ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది. ఈ దావా వేయడానికి దారి తీసిన పరిస్థితులు, నేపథ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
YSRCP MLA Alla Ramakrishna Reddy filed a defamation suit in Nampally Court against telugu daily Andhra Jyothy on Thursday. MLA allaged in his petition that Andhra Jyothy daily is publishing false news article on YCP Chief Jagan Mohan Reddy's Delhi tour. Court taken his petition for enquiry and stated that on August 1, 2017 the court will record MLA Alla Ramakrishna Reddy's statement.