సభకు మోపిదేవి: కెసిఆర్తో డేట్ ఫిక్స్కోసం మోత్కుపల్లి
మోత్కుపల్లి, జర్నలిస్టుల మధ్య ఆసక్తికర చర్చ
శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు, విలేకరుల మధ్య ఆసక్తిక చర్చ జరిగింది.
తానెప్పుడు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నమస్కారం పెట్టలేదని, ఇప్పుడు మీడియా సాక్షిగా తెలంగాణ రాష్ట్రం కోసం తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దీనికి విలేకరులు స్పందిస్తూ.. ఆ మాటేదో ఆయనతో నేరుగా చెప్పవచ్చు కదా, మీడియా ద్వారా ఎందుకన్నారు.
దానికి స్పందించిన మోత్కుపల్లి తాను కలిసి విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమేనన్నారు. అయితే కెసిఆర్ను కలిసేందుకు తేది, వేదికను సిద్ధం చేస్తే కోరుతానన్నారు.
స్పీకర్కు టిటిడిపి లేఖ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పీకర్కు లేఖ రాసింది. నెలాఖరులోగా తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగించాలని, కేంద్రానికి పంపించేందుకు కృషి చేయాలని కోరారు.
పార్లమెంటులో, కోర్టులో: గంటా
తాము సమైక్య రాష్ట్రం కోసం పార్లమెంటులో, కోర్టులో పోరాటం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అభ్యంతరాలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.