లోక్సభలో కాపు రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన ఎంపీ అవంతి
న్యూఢిల్లీ: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ లోక్సభలో శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. తాను ఎందుకు బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే అంశంపై అవంతి శ్రీనివాస్ తెలుగులోనే వివరించారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకే టీడీపీ ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలి? ఎంత సమయం కేటాయించాలి? అనే విషయంపై వచ్చే వారం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా, బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా తమిళనాడు తరహాలో షెడ్యూల్-9లో కాపులను చేర్చాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విద్య, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించింది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications