Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ పెరిగింది.. గంటాకు అయ్యన్న కౌంటర్?, విభేదాలు లేవంటూనే..

తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. విశాఖ భూవిదాంపై తాను స్పందించిన తర్వాతే సిట్‌ విచారణ వేశారని తెలిపారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తాము

విజయవాడ: విశాఖ భూదందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మంత్రి అయ్యన్న ఆరోపించడం.. పార్టీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపిస్తూ మరో మంత్రి గంటా సీఎంకు లేఖ రాయడం.. విశాఖలో టీడీపీ లుకలుకలు బయటపడేలా చేసింది.

ఇంతలోనే అలాంటిదేమి లేదంటూ మంత్రి అయ్యన్న మీడియాకు వివరణ ఇచ్చుకోవడం.. అదే సమయంలో గంటాకు చురకలంటించేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.గురువారం నాడు మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. విశాఖలో భూ వివాదాలు పరిష్కారం కావాలన్నదే తమ ఇద్దరిని అభిమతమని గంటాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

my statements on vizag land scam are used to increase govt prestige says ayyanannapatrudu

అదే సమయంలో పార్టీ ప్రతిష్టను దిగజార్చారన్న గంటా ఆరోపణను ఆయన అంగీకరించలేదు. తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. విశాఖ భూవిదాంపై తాను స్పందించిన తర్వాతే సిట్‌ విచారణ వేశారని తెలిపారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.

కాగా, గురువారం ఉదయం జరిగిన టీడీపీ సమన్వయ భేటీ సమావేశంలో విశాఖ భూముల వ్యవహారంపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులను సీఎం మందలించిన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+