కొండాసురేఖ చేరికపై యాష్కీ: బాబుకి మైనంపల్లి ఝలక్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ద్రోహులకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలా చోటు కల్పించి, టిక్కెట్లు ఇస్తారని నిజామాబాద్ కాంగ్రెసు పార్టీ పార్లమెంట సభ్యుడు మధుయాష్కీ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు. భావితరాలకు భవిష్యత్ కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు.
కాంగ్రెసుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ ఏర్పాటులో ఎంపీల పోరాటం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పని చేశామని చెప్పారు. విద్యార్థులను రాళ్లతో కొట్టించిన, ఉద్యమానికి అన్యాయం చేసిన కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలను తెరాసలో ఎలా చేర్చుకుంటారని కెసిఆర్ను యాష్కీ ప్రశ్నించారు.

కాంగ్రెసులోకి మైనంపల్లి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంత రావు కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని సమాచారం. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా టిడిపి మల్కాజిగిరి స్థానాన్ని బిజెపికి ఇవ్వడంతో ఆయన అలక వహించి కాంగ్రెసులో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మల్కాజిగిరి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశముంది.
కెసిఆర్కు ఆకుల ఝలక్
మరోవైపు మల్కాజిగిరి శాసన సభ్యుడు ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రానున్నారని సమాచారం. ఇటీవలె ఆయన తెరాసలో చేరారు. ఇప్పుడు కెసిఆర్కు షాకిచ్చి తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారట.
పొత్తుపై విహెచ్ ఆగ్రహం
బిజెపి, టిడిపి పొత్తుపై వి హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర రాజకీయాలను వెంకయ్యనాయుడు హైజాక్ చేస్తున్నారని విహెచ్ మండిపడ్డారు. టిడిపి, బిజెపి పొత్తు అనైతికమన్నారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications