వైసీపీ రాక్షస పాలనకు క్లైమాక్స్, పాపాలు ఫినిష్, అందుకే మోదీ వస్తున్నారు, మాజీ సీఎం !
వైకాపా ప్రభుత్వంలో ఇసుక, గనుల అక్రమ దోపిడి, అక్రమ మద్యం వ్యాపారం, అక్రమంగా మద్యం రవాణా, వనరుల దోపిడీ, భూకబ్జాలు వైసీపీ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించారని, ఆ డబ్బును ఈ ఎన్నికల్లో ఓటర్లకు భారీ మొత్తంలో ఖర్చు చేసి మరోసారి గెలవాలని చూస్తున్నారని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే వైసీపీ నాయకుల మాయమాటలకు మరో ఐదు సంవత్సరాలు బలికావలసి వస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు నియోజక వర్గంలోని కలికిరిలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మీద, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

భూకబ్జాలు చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మామిడి, పాడి రైతులను నిలువునా దోపిడీ చేసి వారిని నష్టపరిచారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రైతుల ఉసురు తగులుతుందని, పెద్దిరెడ్డి పాపాలు పండిపోయే రోజులు దగ్గరపడ్డాయని, అంత వరకు రైతులు ఓపికగా ఉండాలని మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకపాలనను అంతం చెయ్యడానికి ప్రతిఒక్కరు పని చెయ్యాలని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కిరణ్ కుమార్ రెడ్డి మనవి చేశారు. ఈ నెల 8వ తేదీన కలికిరిలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అందరూ శ్రమించాలని, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనవి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మే 8వ తేదీన కిలికిరి పర్యటన సందర్బంగా పీలేరు, కలికిరి, వాల్మీకిపురం తదితర ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications