ఒక్కడినే వస్తా.. ఆ 57మందినీ రమ్మంటూ.. సీమ గడ్డపై లోకేష్ ఛాలెంజ్!!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో జోష్ గా కొనసాగి నేడు ముగిసింది. రాయలసీమలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన ఛాలెంజ్ చేశారు. రాయలసీమ ఎమ్మెల్యేలు 49మంది, ఎంపీలు 8మంది.. మీరు 57మందీ రండి అంటూ పేర్కొన్నారు.
రాయలసీమ ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం.. నేను ఒక్కడినే వస్తా.. చర్చకు మేం సిద్ధం అంటూ నారా లోకేష్ సవాల్ చేశారు. రాయలసీమకు మీరేం చేస్తారో చెప్పే దమ్ము ఉందా అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ముందు సెల్ఫీలు దిగిన లోకేష్ ఆ సెల్ఫీ లతో వైసిపి ప్రజాప్రతినిధులను చాలెంజ్ చేశారు.

బద్వేలు క్యాంప్ సైట్ ముందు, టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, రాయలసీమకు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ టిడిపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో టీడీపీ చేసిన అభివృద్ధిని లోకేష్ చూపించారు. ఈ క్రమంలోనే లోకేష్ వైసీపీ నేతలకు మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలి అని సవాల్ విసిరారు.
ఇక ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ మేం చేసింది ఏంటో చూపించాను. మీరు చేసింది ఏమిటో చెప్పే దమ్ము ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్ వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు రాయలసీమకు చేసిందేమీ లేదని, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
Mission Rayalaseema Challenge
— Lokesh Nara (@naralokesh) June 13, 2023
Here's what @JaiTDP did to develop Rayalaseema.
I openly challenge all the 57 elected representatives of the YSRCP from Rayalaseema (49 MLAs+8 MPs) to show a single piece of development done by them in the region. (1/2)#YuvaGalamPadayatra pic.twitter.com/W9GlX11gnX
ఒక పరిశ్రమ ను కూడా తీసుకు రాలేదని లోకేష్ మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి చేసింది తామేనని పేర్కొన్న లోకేష్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని వెల్లడించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications