నారా లోకేష్.. బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ముఖ్యం!!
పాదయాత్రలో తనను కలిసి బాధలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికీ నారా లోకేష్ ఒకటే అభయం ఇస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
యువగళం పేరుతో కుప్పం నుంచి గత నెల 27వ తేదీన నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 250 కిలోమీటర్ల నడకను పూర్తిచేసుకున్నారు. సత్యవేడు నియోజకవర్గం, తిమ్మ సముద్రం, రాగి కుంట, కొత్తూరు, పివి కండ్రిగ గ్రామాల్లో యాత్ర కొనసాగుతోంది. . పాదయాత్ర షెడ్యూల్ బిజీగా ఉంటుండటంతోపాటు రోజుకు నాలుగైదు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సెల్ఫీలు తీసుకోవాలనుకునేవారికి ఓపికగా సమయం కేటాయిస్తున్నారు

250 కిలోమీటర్లు పూర్తి
గత నెల ఇరవై ఏడో తేదీన ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా రెండు వందల యాభై కిలోమీటర్లు సాగింది. పాదయాత్ర షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. రోజుకు నాలుగైదు సమావేశాలు పెట్టుకుంటున్నారు. అన్ని వర్గాలతో మాటా మంతీ జరుపుతుండటంతోపాటు మరోవైపు పార్టీ నేతలకు సమయం కేటాయిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి అర్థరాత్రి వరకూ లోకేష్ బిజీగా ఉంటున్నారు.

వీలైతే అక్కడికక్కడే పరిష్కారం పాదయాత్రలో తనను కలిసి బాధలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికీ నారా లోకేష్ ఒకటే అభయం ఇస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలుకాకపోతే తర్వాత పరిష్కరిస్తాననే భరోసా ఇస్తున్నారు. అంతేకానీ ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం వస్తుంది.. అన్నీ మనవే.. మీకేం ఇబ్బంది లేదు.. లాంటి మాటలు ఉపయోగించడంలేదు. అన్నీ తానే చేస్తానని కూడా చెప్పడంలేదు. ప్రభుత్వ పరంగా ఎటువంటి విధానాలుంటే సమస్యలు రాకుండా ఉంటాయో అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు.
వీలైతే అక్కడికక్కడే పరిష్కారం
పాదయాత్రలో తనను కలిసి బాధలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికీ నారా లోకేష్ ఒకటే అభయం ఇస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలుకాకపోతే తర్వాత పరిష్కరిస్తాననే భరోసా ఇస్తున్నారు. అంతేకానీ ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం వస్తుంది.. అన్నీ మనవే.. మీకేం ఇబ్బంది లేదు.. లాంటి మాటలు ఉపయోగించడంలేదు. అన్నీ తానే చేస్తానని కూడా చెప్పడంలేదు. ప్రభుత్వ పరంగా ఎటువంటి విధానాలుంటే సమస్యలు రాకుండా ఉంటాయో అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు.

పరిణతి చెందిన రాజకీయవేత్తగా..
అమీర్ పేటలో మూడునెలల కోర్సు చేరితేకానీ ఉద్యోగం రాదని, ఆ కోర్సులను కాలేజీల్లోనే ఎందుకు ప్రవేశపెట్టకూడదని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయంపై దృష్టిసారిస్తుందని, యువతకు ఉద్యోగం రావడానికి ఏయే కోర్సులు అవసరమవుతాయో వాటిని కచ్చితంగా ప్రవేశపెడతామని చెప్పిన హామీ యువతను ఆకట్టుకుంది. ప్రజా సమస్యలకు డబ్బులొక్కటే ఇస్తే పరిష్కారం కావని, తిరిగి ఆ డబ్బులను ప్రజల నుంచే వసూలు చేస్తారని వివరించి చెబుతూ అందరూ ఆలోచించేలా చేస్తున్నారు. 250 కిలోమీటర్లకే నారా లోకేష్ తనను తాను తీర్చిదిద్దుకున్నాడని, 4వేల కిలోమీటర్లు పూర్తయ్యేసరికి అతనొక పరిణతి చెందిన రాజకీయవేత్తగా అవతరిస్తాడని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications