Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంశీ ఇలాకాలో నారా లోకేశ్, మిషన్ 2024 - ఉత్కంఠ..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం పీక్ కు చేరింది. టీడీపీకి రానున్న ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ గా మారుతోంది. అదే సమయంలో టీడీపీకి కొందరు నేతలను ఈ సారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. అందులో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేసారు. ఇప్పుడు జిల్లాలోకి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశిస్తోంది. యాత్ర వేళ గన్నవరంలో నారా లోకేశ్ బస, సభ లో పాల్గొననుండటంతో ఉత్కంఠ పెంచుతోంది.

కృష్ణా జిల్లాలోకి లోకేశ్ యాత్ర : ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు సీట్లకు పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తమకు పట్టు కున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు నారా లోకేశ్ యాత్ర పైన జిల్లా టీడీపీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. సక్సెస్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Nara Lokesh to atted public meeting in Gannavaram, likely to announce party candidate against Vamsi

ఈ నెల 19వ తేదీ మధ్నాహ్నం లోకేశ్ యువగళం యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కి ప్రవేశిస్తుంది. 19,20,21 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించి పార్టీ నేత కేశినేని చిన్ని యాత్ర షెడ్యూల్ ను వెల్లడించారు. పార్ట్టీ నేతలంతా కలిసి యాత్ర సక్సెస్ చేస్తారని చెప్పుకొచ్చారు. జిల్లాలో మొత్తం అయిదు నియోజకవర్గాల్లో లోకేశ్ యాత్ర కొనసాగనుంది.

మూడు రోజుల పాదయాత్ర : 19న విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో లోకేశ్ యాత్ర కొనసాగనుంది. సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధా, బోండా ఉమ మధ్య పోటీ నెలకొని ఉండటంతో అక్కడ లోకేశ్ యాత్ర పైన ఆసక్తి కొనసాగుతోంది. అదే విధంగా 20న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ యాత్ర నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసారు.

తూర్పు నుంచి పెనమలూరులోకి యాత్ర ప్రవేశిస్తుంది. 20వ తేదీ రాత్రి గన్నవరం లో లోకేశ్ బస చేయనున్నారు. 21న గన్నవరంలో పాదయాత్ర..భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసారు. లక్ష మందితో ఈ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా గన్నవరం నియోజకవర్గంలో తమ బలం చాటాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.

Nara Lokesh to atted public meeting in Gannavaram, likely to announce party candidate against Vamsi

గన్నవరం లో సభపై ఉత్కంఠ : ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరంతో పాటుగా గుడివాడ ను టీడీపీ లక్ష్యంగా చేసుకుంది. ఎలాగైనా కొడాలి నాని, వల్లభనేని వంశీని ఓడించాలని భావిస్తోంది. యాత్ర సమయం కుదించటంతో గన్నవరం తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తోంది. అయితే, గన్నవరంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి ఎవరికి దించుతారనేది ఆసక్తి కరంగా మారింది.

ప్రస్తుత వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. వైసీపీ తమ అభ్యర్ధిగా వంశీని బరిలోకి దించనుంది. ఈ సమయంలో గన్నవరంలో వంశీ లక్ష్యంగా లోకేశ్ ఏం మాట్లాడుతారు.. వంశీ మద్దతు దారుల నుంచి స్పందన ఎలా ఉంటుంది..రాజకీయంగా పరిణామాలు ఎంటా ఉంటదయనే ఉత్కంఠ నియోజకవర్గంలో కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+