జగన్ ను "ఫిక్స్" చేస్తున్న కూటమి - "డిక్లరేషన్" కు సిద్దమేనా..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. లడ్డూ వివాదం వేళ జగన్ ను ఫిక్స్ చేసేందుకు కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. ఈ నెల 28న శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే, ఇప్పుడు కూటమి నేతల డిమాండ్ కు జగన్ అంగీకరిస్తారా..ఏం జరుగుతోంది.
తిరుమలకు జగన్
తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఆ అంశం రాజకీయ వివాదంగా మారింది. చంద్రబాబు రాజకీయం కోసం తిరుమల లడ్డూ అంశం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ అంశం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 27న జగన్ తిరుమల చేరుకుంటారు. 28వ తేదీ ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే, జగన్ పర్యటన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

డిక్లరేషన్ ఇవ్వాలి
జగన్ తిరుమల పర్యటన వేళ కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. జగన్ తిరుమల పర్యటన కు తనకు శ్రీవారి పైన నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో సహా బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే విధంగా మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఇదే డిమాండ్ చేసారు. జగన్ గతంలో తిరుమల సందర్శన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని అంశాన్ని తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు సైతం ప్రస్తావించారు.
We are given to understand that Jagan Mohan Reddy intends to visit Tirumala on the 28th of this month. The practice of declaring one's faith has been in vogue for decades in Tirumala. As per G.O. MS NO- 311 of AP Revenue Endowments--1, Rule no 16, Non Hindus must give a… pic.twitter.com/MKwafeXsDe
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) September 25, 2024
జగన్ నిర్ణయం ఏంటి
ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. జగన్ 2018లో తన పాదయాత్ర ముగిసిన తరువాత కాలి నడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు శ్రీవారి దర్శనంతో పాటుగా..బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు లడ్డూ వివాదం వేళ జగన్ మరోసారి జగన్ డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది. జగన్ అన్యమతస్తుడు కావటంతో డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లాలని పురందేశ్వరి డిమాండ్ చేసారు. దీంతో..ఇప్పుడు జగన్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications