బీజేపీకి బాబు ఝలక్: టీటీడీలో నో ఛాన్స్, ఎమ్మెల్యే అలక
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు దక్కనందుకు ఎమ్మెల్యే ఒకరు అలక వహించినట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు టీటీడీ పాలక మండలిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భారతీయ జనతా పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డికి చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ పొత్తు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులకు కొందరికి అవకాశం వస్తుందని అందరు భావించారు.
అందులో చింతల రామచంద్రా రెడ్డి పేరు కూడా వినవచ్చింది. తీరా ప్రకటించాక చింతల పేరు లేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. సొంత పార్టీ నేతల వల్ల కూడా చింతలకు చోటు దక్కి ఉండవకపోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

బీజేపీ నేత, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్య రావు చేసిన సిఫార్సులను పక్కకుపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెదేపాకు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
మాణిక్యాల రావు సిఫార్సు చేసిన పేర్లలో చింతల రామచంద్రా రెడ్డి పేరు కూడా ఉందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలకే కాకుండా, ఏపీ బీజేపీ నేతలకు కూడా చోటు దక్కక పోవడం గమనార్హం. అదే తెలంగాణకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనే చర్చ కూడా సాగుతోంది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications