వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు: టిడిపి నేతల క్షీరాభిషేకం

By Pratap
|
Google Oneindia TeluguNews

NTR statue defaced in Warangal district
వరంగల్: వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి నిప్పు పెట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్‌లోని ఎన్టీ రామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. గురువారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది.

గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీ రామారావు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణతో గతంలో అటువంటి సంఘటనలు జరిగాయి.

ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఎన్టీ రామారావు విగ్రహానికి ఎవరు, ఎందుకు నిప్పు పెట్టారనే విషయం తెలియడం లేదు. తెలంగాణకు, సంఘటనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే విషయం కూడా తెలియడం లేదు.

English summary
Telugudesam founder NT Rama rao's statue has been destroyed at Narsampet town in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X