వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల కేసు రీ-ఓపెన్, జగన్‌కు తెలియదు: పత్తిపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Ravi murder case may reopened
గుంటూరు: తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి హత్యోదంతంపై పునర్విచారణ జరిపే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు శనివారం అన్నారు. గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. శాంతిభద్రతలపై వాస్తవాలను వినలేక జగన్ అండ్ కో సభ నుంచి పారిపోయారన్నారు. వాస్తవానికి జగన్‌కు జైలు - అసెంబ్లీలకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను అద్దంపట్టే శాసనసభ దేవాలయం లాంటిదన్నారు. సభలో చర్చ జరిగితే తమ నేరిచరిత్ర అంతా బయటకు వస్తుందనే భయంతోనే ఆయన వాకౌట్‌చేసి పారిపోయారన్నారు.

అసలు శాంతిభద్రతలపై మాట్లాడే అర్హత, నైతికత జగన్‌కు లేదన్నారు. రుణమాఫీ ప్రక్రియను రెండునెలల్లోగా పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోందని పుల్లారావు పేర్కొన్నారు. బడ్జెట్‌లో 5వేల కోట్లరూపాయలు మాత్రమే కేటాయించినప్పటికీ సర్కారుకు వివిధ కీలకశాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని సెక్యూరిటైజ్ చేయడం ద్వారా నిధులను సేకరిస్తామని తెలిపారు.

English summary
Telugudesam Party Paritala Ravi murder case may reopened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X