పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు: తెలంగాణలో క్షేత్రాల సందర్శన, రెండు రాష్ట్రాల నేతలతో భేటీ

హైదరాబాద్: దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌​లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సరస్వతిదేవి రూపంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. ​అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ప్రార్థించారు.

అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబర్ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. త్వరలోనే జిల్లాలవారీగా సమీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ పట్టణాలతో ప్రారంభించనున్నామన్నారు. ముఖ్యంగా మంగళగిరిలో జరిగే ఈ సమావేశాలకు సంబంధించి సూచనలు చేశారు.

 Pawan Kalyan did special puja for Saraswati mata in his party Janasena office.

అలాగే, క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వాలంటీర్లు, వీర మహిళలతో, సోషల్ మీడియా - శతఘ్ని క్రియాశీలక సభ్యులతోనూ సమావేశం కావాలని పవన్ కళ్యాణ్​ నిర్ణయించారు. 'నా సేన నా వంతు' కార్యక్రమంపై సమీక్ష చేపట్టనున్నారు.

రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు నేతలు తెలిపారు. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి, అక్కడ్నుంచి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+