పార్టీది సమైక్య వైఖరే: ఎర్రబెల్లికి పయ్యావుల కౌంటర్

Payyavula Keshav
హైదరాబాద్: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకుడు పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీది సమైక్య విధానమేనని, తాను సమైక్యవాదినే అని ఆయన అన్నారు.

తన స్థానం పార్టీలో ఏమిటనేది అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజలు చెప్తారని ఆయన అన్నారు. తనను ఎవరు బాధించినా, అవమానించినా తన విధానం మారదని ఆయన స్పష్టం చేశారు. తనకు జరిగిన అవమానం సీమాంధ్ర ప్రజల బాధల ముందు చాలా తక్కువదని ఆయన అన్నారు. ఏది సరైందనేది చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

పార్టీలో ఎక్కువ మంది సమైక్యవాదం వినిపిస్తున్నారని ఆయన అన్నారు. తనకు జరిగిన అవమానం చాలా చిన్నదని, చిన్న విషయాలను పట్టించుకుని తన లక్ష్యం నుంచి దృష్టిని మరలించదలుచుకోలేదని ఆయన అన్నారు. తాను సమైక్యవాదాన్ని కొత్తగా వినిపించడం లేదని, డిసెంబర్ నుంచే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నానని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో పార్టీ స్వరం మారుతోందనే భయంతో ఎర్రబెల్లి దయాకర్ రావు తనపై వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన అన్నారు. పార్టీలో సమైక్యవాదాన్ని వినిపించే హక్కు తనకు ఉందని, తెలంగాణ నేతలు వారి వైఖరి గురించి మాట్లాడినప్పుడు తాము ఏమీ అనలేదని, వారు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+