టిపై కోపం లేదన్న బాబు విల్లు ఎక్కు పెట్టారు (పిక్చర్స్)
నెల్లూరు: సీమాంధ్రను స్వర్ణాధ్రప్రదేశ్గా మారుస్తానని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నెల్లూరులో విఆర్సి గ్రౌండ్లో జరిగిన ప్రజాగర్జన భారీ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాగర్జన పేరుతో నెల్లూరులో సభను ఏర్పాటు చేశామన్నారు.
అయితే బుధవారం ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ సభను ఎన్నికల సమర శంఖారావం సభగా ప్రకటిస్తున్నానని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే కాంగ్రెసుకు ఓటేసినట్లేనన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. విభజించింది చాలక కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్రకు భిక్షం వేస్తున్నాడని మండిపడ్డారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన మీరు రాష్ట్రానికే వెన్ను పోటు పొడిచారని ఆయన ఆరోపించారు. తమిళనాడులో చిదంబరం మరలా గెలుస్తాడనే నమ్మకం లేదని, బెంగళూరు మొయిలీ కనపడడని, ఆంటోని కేరళలో గెలవడని, మహరాష్టల్రో సుశీల్కుమార్ షిండే ఆధార్ కుంభ కోణంలో ఇరుక్కున్నాడని ఆయన అన్నారు.

విల్లు ఎక్కుపెట్టిన బాబు
ఇతర రాష్ట్రాల వారు రాష్ట్రంలో విభజనకు కారకులయ్యారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి పౌరుషానికి నెల్లూరు గడ్డ ఎంతో ప్రాముఖ్యత ఉందని, స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగధనులు పొట్టిశ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య ఈ జిల్లా వాసులేనని ఆయన అన్నారు.

పార్టీలోకి నేతలు
తెలుగుజాతికి న్యాయం చేయండి అని ఎక్కని గడపలేదని ఆయన అన్నారు. మనకు తెలంగాణలో ఉండే తెలుగుజాతిపై కోపం లేదని, మన కోపం సోనియా పైనేనని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ప్రవర్తించాయన్నారు.

నాగలితో బాబు
ఐదు నెలలు ఆగితే టిడిపి ప్రభుత్వం వస్తుందని, రాజధాని మనమే నిర్మించుకుందామని చెప్పారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో నిలిపిన ఘనత తనదేనని చెప్పారు.

సైకిల్ బహుకరణ
బ్రహ్మాండమైన రాజధాని కట్టే సమర్ధత అనుభవం తనకే ఉందన్నారు. వైయస్ జగన్కు అధికారమిస్తే జైలు నిర్మించగలడని ఎద్దేవా చేశారు.

విల్లు ఎక్కుపెడుతూ..
బుధవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్లీ జగన్ ఆస్తులను జప్తు చేశారని, ఇప్పటికి నాలుగుసార్లు జగన్ ఆస్తులు జప్తుచేశారని అన్నారు.

గద పట్టుకొని
వైయస్ జగన్ లాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తాడని అన్నారు. తనపై కక్షకట్టి తెలుగుజాతి మధ్య కేంద్రం చిచ్చు పెట్టారని అన్నారు.

చంద్రబాబు
జగన్, కెసిఆర్ను సంతృప్తి పర్చేందుకు సోనియా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపించారు. కెసిఆర్ సోనియాకి సరైన గుణపాఠం చెప్పాడని, అలాగే సీమాంధ్రలో జగన్ అడ్రస్ లేకుండా పోతాడని జోస్యం చెప్పారు.

ప్రజాగర్జన
సీమాంధ్రను అభివృద్ధి చేయడం తన వల్లే సాధ్యమవుతుందన్నారు. సామాజిక తెలంగాణ నిర్మించి తెలుగుజాతి మధ్య ఐక్యత సాధిస్తానని తెలపారు.

భారీ జనం
సాధారణ ఎన్నికలు ముందు వచ్చిన మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్స్లాంటివని ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వేదిక
సీమాంధ్రను స్వర్ణాధ్రప్రదేశ్గా మారుస్తానని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నెల్లూరులో విఆర్సి గ్రౌండ్లో జరిగిన ప్రజాగర్జన భారీ సభలో ఆయన ప్రసంగించారు.

గర్జన వేదిక
ప్రజాగర్జన పేరుతో నెల్లూరులో సభను ఏర్పాటు చేశామన్నారు. అయితే బుధవారం ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ సభను ఎన్నికల సమర శంఖారావం సభగా ప్రకటిస్తున్నానని తెలిపారు.

మాట్లాడుతున్న బాబు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే కాంగ్రెసుకు ఓటేసినట్లేనన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. విభజించింది చాలక కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్రకు భిక్షం వేస్తున్నాడని మండిపడ్డారు.

హాజరైన నేతలు
రాష్ట్రం నుంచి ఎన్నికైన మీరు రాష్ట్రానికే వెన్ను పోటు పొడిచారని ఆయన ఆరోపించారు. తమిళనాడులో చిదంబరం మరలా గెలుస్తాడనే నమ్మకం లేదని, బెంగళూరు మొయిలీ కనపడడని, ఆంటోని కేరళలో గెలవడని, మహరాష్టల్రో సుశీల్కుమార్ షిండే ఆధార్ కుంభ కోణంలో ఇరుక్కున్నాడని ఆయన అన్నారు.

నాయుడు
సీమాంధ్రను స్వర్ణాధ్రప్రదేశ్గా మారుస్తానని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నెల్లూరులో విఆర్సి గ్రౌండ్లో జరిగిన ప్రజాగర్జన భారీ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాగర్జన పేరుతో నెల్లూరులో సభను ఏర్పాటు చేశామన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications