నమిత, రోజా.. హిజ్రాల భయం: తెలంగాణలో సమితి
హైదరాబాద్: గత ఐదు నెలలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ హిజ్రాలు భయాందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వెంకట్ అనే పేరుగల రౌడీషీటర్ వారిని కనబడిన చోటల్లా బెదిరించి, భయపెట్టి, కొట్టి, విచక్షణారహితంగా పదునైన వస్తువులతో దాడి చేసి వారి వద్ద నుండి నగదును, ఆభరణాలను, విలువైన వస్తువులను దోచుకుంటున్నాడని చెబుతున్నారు.
జంట నగరాలలో జరుగుతున్న ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకట్ అనే ఈ రౌడీషీటర్ సాధారణంగా హిజ్రాలు గుంపుగా సంచరించే ప్రాంతాల వద్ద కాపు కాసి వారిలో ఒకరిని కత్తితో లేదా మరో మారణాయుధంతో గాని చంపుతానని బెదిరించి మిగిలిన వారి వద్ద నుండి నగదు, విలువైన వస్తువులు అపహరిస్తున్నాడు.
గత ఐదు నెలల్లో ఈ రౌడీషీటర్ సుమారు ఏడు ప్రాంతాలలో ఇరవై మంది హిజ్రాలను దారుణంగా కొట్టి, హింసించి, దోచుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇతను దాడి చేసిన ప్రాంతాలలో కూకట్పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, ఇందిరా నగర్, మెట్రో షాపింగ్ మాల్, ఫతేనగర్, బాలానగర్ ఉన్నాయి.
ఇప్పటి వరకు చేసిన దాడిలో రుక్మిణి అనే హిజ్రా పైన జరిగిన దాడి అత్యంత పాశివికమైనదిగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రుక్మిణి ఇంటికి వెళ్లే దారిలో రాత్రి పది గంటల సమయంలో మెట్రో షాపింగ్ మాల్ వద్ద.. అడ్డగించి కత్తితో చాతి, కడుపు, రెండు చేతుల పైన దాడి చేశాడు.

హిజ్రాలు
మరునాడు మళ్లీ రుక్మిణిని అదే ప్రదేశంలో కిడ్నాప్ చేసి కాలికి ఉన్న పట్టగొలుసు ఒకటి తీసుకొని ఇంకొకటి తీయరాక పోవడంతో.. రుక్మిణి స్నేహితులకు ఫోన్ చేసి రూ.5వేల తీసుకు రమ్మని చెప్పాడు. రుక్మిణిని బెదిరించి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మారుతి వ్యాన్లో తిప్పి తిరిగి మెట్రో వద్ద వదిలి వెళ్లిపోయాడు.

హిజ్రాలు
హైటెక్ సిటీ వద్ద తానియా, ధనలక్ష్మి అనే హిజ్రాలను వెంబడించి వారి సెల్ ఫోన్లు తీసుకున్నాడు. అంతేకాక వారి ఇంటి యజమాని నుండి రూ.5వేలు తీసుకున్నాడు. కూకట్పల్లిలో యశోద అనే హిజ్రా వద్ద నుండి రూ.5వేలు తీసుకున్నాడు. అంతేకాక, ఇంటి నుండి గ్యాస్ సిలిండర్ తీసుకొని పరారయ్యాడు.

హిజ్రాలు
వెంకట్ భారిన పడిన ఇతర హిజ్రాల్లో నమిత, చంద్రముఖి, రేష్మ, అమృత, మోనాలిస, స్వీటీ, గౌరీ, భాను, రోజా, షబానా, లక్ష్మీకళలు ఉన్నారు. హిజ్రాల పెద్దలను బెదిరించి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బు వేయమని బెదిరిస్తున్నాడు. వెంకట్ పైన పలు పోలీసు స్టేషన్లలో హిజ్రాలు ఫిర్యాదు చేశారు.

హిజ్రాలు
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్, హిజ్రాల సాధికారత, గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి (టీహెచ్టీఎస్) ఏర్పడింది. హిజ్రా, ట్రాన్స్ జెండర్ సమూహం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక బహిష్కరణలు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు టీహెచ్టీఎస్ ఈ నెల 10వ తేదీన ఇందిరా పార్కు వద్ద స్వాభిమాన సభ నిర్వహిస్తోంది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications