రాజధానిపై బాబుకి కేసీఆర్, వీరిద్దరు ఇలా... (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాజధాని పైన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సలహా ఇచ్చారట. రాజధానికి ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని, అలాంటి నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని కేసీఆర్ చెప్పారట. రాజధానికి ఏ ప్రాంతం అయితే బాగుంటుందని కేసీఆర్ను చంద్రబాబు అడిగారు. దానికి కేసీఆర్ బదులిస్తూ... అమరావతి, మంగళగిరి లాంటి ప్రాంతాలు అయితే బాగుంటుందని చెప్పారు.
ఒకరి తర్వాత మరొకరు
గవర్నర్ నరసింహన్తో జరిగిన సామావేశంలో చర్చ అనంతరం అంశాలను వెల్లడించేందుకు కేసీఆర్, చంద్రబాబులు ఒకరి తర్వాత ఒకరు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా చంద్రబాబు ఆరు గంటలకు ఏర్పాటు చేశారు.
బాబు, కేసీఆర్ భేటీ
చంద్రబాబు, కేసీఆర్ భేటీ మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉద్యోగుల విభజన మధ్యే ప్రధానంగా చర్చ జరిగింది.
భేటీకి హాజరైన కోడెల, మధుసూదనాచారి, స్వామిగౌడ్
ముందుగా ఇరు రాష్ట్రాల సీఎస్లు కూర్చుని ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని చంద్రబాబు, కేసీఆర్ చెప్పారు.
భేటీకి వచ్చిన అధికారులు
45 వేలమంది ఉద్యోగుల పంపిణీకి కమలనాథన్ కమిటీ ఎందుకని, ఇద్దరు సీఎస్లూ సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని వారన్నారు.
భేటీకి వచ్చిన అధికారులు
ఉద్యోగుల విభజన పూర్తవగానే నీటి సమస్యలపై కూర్చుందామని చంద్రబాబుతో కేసీఆర్ అన్నారు. రెండు మూడుసార్లు సమావేశమై నీటి పంపకాల సమస్యను పరిష్కరించుకుందామన్నారు.
రాజ్ భవన్లో కేసీఆర్, చంద్రబాబు, గవర్నర్
కేంద్రం చేసే సాయానికి గవర్నర్, చంద్రబాబు సహకరించాలని కేసీఆర్ కోరారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి నిధుల సేకరణలో గవర్నర్ పాత్రే కీలకమన్నారు.
చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్
మనిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వద్దని కేసీఆర్తో చంద్రబాబు అన్నారట. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుందామని బాబు హితవు పలికారు. ఘర్షణ పడితే వ్యవస్థలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని బాబు చెప్పారట.
బాబు, కేసీఆర్, గవర్నర్
చంద్రబాబు, కేసీఆర్ భేటీ మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉద్యోగుల విభజన మధ్యే ప్రధానంగా చర్చ జరిగింది.
కేసీఆర్, బాబు, గవర్నర్
రాజ్ భవన్కు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్. పక్కన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
కేసీఆర్, బాబు, గవర్నర్
రాజ్ భవన్కు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్. పక్కన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.