ఇరుకున పెట్టే వ్యూహం: చేయి కలిపిన భట్టి,ఎర్రబెల్లి! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం నాడు శాసన సభలో కొత్త జిల్లాలు, పొన్నాల లక్ష్మయ్యకు చెందిన భూమి తదితర అంశాల పైన చర్చించారు. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జీరో అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కొత్త జిల్లాల ప్రతిపాదన తమ వద్ద ఉందని, అయితే జిల్లాల ఏర్పాటు పైన నిర్దిష్ట కాలపరిమితి మాత్రం లేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఇంకా ఖరారు కావాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎల్లుండి శాసన సభ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెరాసలో చేరిన విఠల్ రెడ్డి, రెడ్యా నాయక్, కనకయ్య, యాదయ్యలతో సహా మొత్తం 22 మంది సభ్యులకు విప్ జారీ చేసింది. తద్వారా ఫిరాయింపుదారులను ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎర్రబెల్లి
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు.
ఎర్రబెల్లి, భట్టి
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద చేయి కలుపుతున్న టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క.
కాంగ్రెస్
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు.
కాంగ్రెస్
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు. మాట్లాడుతున్న జీవన్ రెడ్డి.
కాంగ్రెస్
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు. మాట్లాడుతున్న డీకే అరుణ.
శ్రీనివాస్ గౌడ్
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు శ్రీనివాస్ గౌడ్.