తల్లీకూతుళ్ల అదృశ్యం: అంతలోనే రైలు కింద (ఫొటోలు)
హైదరాబాద్: సూపర్మార్కెట్కు వెళ్లి వస్తానని కూతురుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ కొద్దిసేపటికి హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగర్లోని మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్యాంప్రసాద్కు వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన స్వప్నతో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది.
వారికి ఇషాన్వీ అనే కుమార్తె, అచ్యుత్ అనే కుమారుడు ఉన్నారు. రిలయన్స్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న శ్యాంప్రసాద్ భార్యాపిల్లలు, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో స్వప్న కుమారుడు అచ్యుత్ను అత్తగారి వద్ద ఉంచి ఇషాన్వీతో కలిసి గాంధీనగర్లోని మోర్ సూపర్మార్కెట్ వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది.
మధ్యాహ్నం అయినా వారు ఇంటికి రాకపోవడంతో శ్యాంప్రసాద్ తల్లి విషయాన్ని కుమారుడికి చెప్పింది. ఇంటికి వచ్చిన శ్యాంప్రసాద్ మోర్ సూపర్మార్కెట్కు వెళ్లగా అక్కడ కనిపించలేదు. భార్య, కుమార్తెల ఆచూకీ కోసం అనేక చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మిస్సింగ్ అంతలోనే..
తొలుత స్వప్న స్వగ్రామం వెళ్లి ఉంటుందని భావించారు. సూపర్మార్కెట్లో సీసీ పుటేజీలను పరిశీలించాలని అనుకున్నారు. ఈలోగా ఘట్కేసర్లోని యానాంపల్లి వద్ద రైలు పట్టాలపై మహిళ, బాలిక మృతదేహాలు ఉన్నట్టు సమాచారం అందింది.
మిస్సింగ్ అంతలోనే..
యానాంపల్లి వద్దకు వెళ్లిన పోలీసులు మృతదేహాలు స్వప్న, ఇషాన్వీవిగా గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు.
మిస్సింగ్ అంతలోనే..
వీరి ఆత్మహత్యకు కారణాల గురించి అన్వేషిస్తున్నారు. తనకు భార్యతో విభేదాలు లేవని, వారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని శ్యాంప్రసాద్ చెబుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భవ్యశ్రీని గుర్తు చేసిన..
స్వప్న ఉదంతం ఇటీవలి మహిళా టెక్కీ భవ్యశ్రీ ఉదంతాన్ని గుర్తు చేసింది. భవ్యశ్రీలాగే స్వప్న వెళ్లిపోయి ఉంటుందనే అనుమానాలు కలిగాయి.