అంగన్వాడీ టీచర్నని చెప్పి.. అద్దె ఇంట్లో వ్యభిచారం..
అంగన్వాడీ టీచర్నని చెప్పి అద్దె ఇంట్లో దిగిన ఓ మహిళ.. గుట్టు చప్పుడు కాకుండా అందులో వ్యభిచారం నిర్వహిస్తోంది.
కర్నూలు: అంగన్వాడీ టీచర్నని చెప్పి అద్దె ఇంట్లో దిగిన ఓ మహిళ.. గుట్టు చప్పుడు కాకుండా అందులో వ్యభిచారం నిర్వహిస్తోంది. 15రోజులుగా సాగుతున్న ఈ బాగోతాన్ని పోలీసులు ఎట్టకేలకు బయటపెట్టారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఈ సంఘటన వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం..ఎమ్మిగనూరు పట్టణం ఉప్పర కాలనీకి చెందిన గాండ్ల పద్మ అలియాజ్ రాధమ్మ అంగన్వాడీ టీచర్నని చెప్పి శ్రీనగర్ కాలనీలో 15రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుంది.
ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పేద మహిళలు, విద్యార్థులకు డబ్బు ఆశ చూపి వారితో రాధమ్మ వ్యభిచారం చేయిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇంటిపై దాడి చేశారు. దాడుల్లో పట్టుబడ్డ విటులు ఎమ్మిగనూరుకు చెందిన యూకే వినోద్కుమార్, యూపీ రమేష్, పి.మల్లికార్జున్ లను అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.