కడప ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే ?
కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసు నిందితుడు ప్రేమోన్మాది వెంకటేశ్పై పోలీసులు కాల్పులు జరిపారు. శనివారం ( 11-4-2026 ) తెల్లవారుజామున నిందితుడు పోలీసుల అదుపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడిన వెంకటేశ్ కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
పోలీసులు నిందితుడు వెంకటేశ్ను మైదుకూరు నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా, అతడు ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. పారిపోతున్న వెంకటేశ్ను అడ్డుకునేందుకు పోలీసులు తొలుత గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే నిందితుడు పోలీసులపై ఎదురుతిరగడంతో, అతడి కాళ్లపై కాల్పులు జరపాల్సి వచ్చిందని సమాచారం.

ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, నాగ మునెమ్మల 17 ఏళ్ల కుమార్తె ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. అదే మండలంలోని ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేయగా, ఆ యువతి నిరాకరిస్తూ వచ్చింది. దీంతో వెంకటేశ్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదను చూసి బాలిక ఇంటికి వచ్చిన అతడు, మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోసి వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను తండ్రి శ్రీనివాసులు, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో చెన్నూరు వద్ద కడప రిమ్స్కు తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు విడిచింది. చనిపోవడానికి ముందు యువతి తన తండ్రితో వెంకటేశ్, ప్రవీణ్ పేర్లను ప్రస్తావించింది. మిగతా వివరాలు చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, మాట్లాడలేకపోయింది. దీంతో యువతి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కడప జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇప్పటికే ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులను ఎట్టి పరిస్ధితుల్లోనూ క్షమించలేమన్నారు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైందని, చట్టవ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications