Guntur GGH: 12 గంటల్లోనే కిడ్నాపైన శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసులు..
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం ఓ మహిళ కిడ్నాప్కు గురైన ఎనిమిది రోజుల పసికందును గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులోని సుబ్బయ్య కాలనీకి చెందిన రోషిణి డెలవరీ కోసం సెప్టెంబర్ 26న గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చారు. రోషిణి సెప్టెంబర్ 31న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాతి రోజు ఆమెను 106వ వార్డుకు తరలించారు. బాలింతలు ఎక్కువగా ఉండడంతో ఒక్కో బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టారు.
రోషిణితో పాటు ఆమె అత్త కూడా ఉంది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శిశువుకు పాలు పట్టించారు. ఆ తర్వాతు శిశువు నిద్రపోగా.. తల్లి, నానమ్మ కూడా నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం 4 గంటలకు రోషిణి నిద్ర లేచి చూసేసారికి తన బిడ్డ కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు.

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఓ మహిళ శిశువును ఎత్తుకెళ్తున్నట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. వెంటనే ఆమె సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు 12 గంటల్లోనే పోలీసులు పసికందును రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.మంగళవారం పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఉప్పలపాడుకు చెందిన నిందితులు కంబాల లక్ష్మి(38) మధ్యాహ్నం తల్లీకూతుళ్లు నిద్రిస్తుండగా.. పసికందును అపహరించి ఆటోరిక్షాలో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
గుంటూరులో ఆస్పత్రిలో అపహరణకు గురైన ఓ శిశువు pic.twitter.com/ML5APEzkDq
— oneindiatelugu (@oneindiatelugu) October 4, 2023
నిందితులు గుంటూరు బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితురాలి ఇంట్లో పసికందును పోలీసులు గుర్తించారు. ఆస్పత్రిలోకి రోగుల సహాయకులుగా కొంత మంది వచ్చి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్ చెప్పారు. రోజూ ఆసుపత్రికి సుమారు 3 వేల మందికి పైగా ఓపీ, 1600 మందికి పైగా ఇన్ పేషంట్లు వస్తారని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications