జగన్ నా వాళ్లే గెలిచారు.నేను గెలిపించాను అంటే గూబ గుయ్మంటోంది
భారత రాజకీయాల్లో తిరుగులేని ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ (పీకే) సొంత రాజకీయ ప్రయాణం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత రెండు దశాబ్దాలుగా పలు పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన 'గేమ్-ఛేంజర్', తన సొంత పార్టీ జన్ సూరజ్ విషయంలో చతికిలపడ్డారు.
6000 కి.మీ. పాదయాత్ర, కోటి మందికి పైగా సభ్యులు, క్షేత్రస్థాయిలో 1,300 మంది నిపుణులతో భారీ యంత్రాంగాన్ని నడిపినప్పటికీ, జన్ సూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ పోటీ చేసిన 238 స్థానాల్లో దాదాపు 98% (233 సీట్లలో) డిపాజిట్లు గల్లంతయ్యాయి. కనీసం 10 లక్షల ఓట్లను కూడా సాధించలేకపోయింది.

ఎన్నికలకు ముందు బీహార్లో ఎన్డీఏ గెలవదని, నితీష్ కుమార్ 25 సీట్లు దాటితే రాజకీయాల నుండి తప్పుకుంటానని పీకే సవాలు విసిరారు. కానీ, అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ అఖండ విజయం సాధించింది, జేడీయూ 80 సీట్లకు చేరుకుంది. తన సొంత అంచనాలు, సవాళ్లు విఫలం కావడంతో, ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుండి వైదొలగుతారా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
"అందరికీ శకునం చెప్పే బల్లి... కుడితిలో పడింది" అన్నట్టుగా, నిపుణుల టీమ్తో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసిన పీకే, తన రాష్ట్ర ప్రజల నాడిని పట్టుకోలేకపోవడం ఆయన కెరీర్లోని అతిపెద్ద వైఫల్యంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.
ముఖ్యంగా జగన్ అభిమానులు ప్రశాంత్ కిషోర్పై ఓ రేంజ్పై ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో వైసీపీకి నేను ఇచ్చిన వ్యూహాలు బాగా పని చేశాయని, దాని వల్లే విజయం సాధ్యమైందనే విధంగా మాట్లాడారు. జగన్ సైతం వైసీపీ గెలుపును ప్రశాంత్ కిషోర్కు ఇచ్చేశారు. అక్కడే కార్యకర్తలకు , పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. గత ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫలితంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ..
నరేంద్ర మోదీ,జగన్, స్టాలిన్ , కేసీఆర్ వంటి వారిని నేనే సీఎం చేశాను అని చెప్పే ప్రశాంత్ కిషోర్..సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తోంది. ఇంకోసారి నా వాళ్లే గెలిచారు.నేను గెలిపించాను అంటే బాగోదంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. వ్యూహకర్తగా విజయం సాధించిన ఆయన, క్షేత్రస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని పొందడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications