ఎపిలో రాష్ట్రపతి పాలన: 40 ఏళ్ల తర్వాత రెండోసారి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు నలభై ఏళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం ఉదయం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో మంత్రివర్గం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపింది
ఇక ఎపిలో రాష్ట్రపతి పాలన లాంఛనమేనని తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించవలసి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా, అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టారు.
రాష్ట్రంలో రెండోసారి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి అవుతుంది. 1973లో ఆంధ్ర ఉద్యమ సమయంలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు రెండోసారి ఎపిలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. రాష్ట్రపతి పాలనలో పాలనా పగ్గాలు గవర్నర్ చేతికి వెళ్తాయి.
సిఎస్ మహంతిని కలిసిన గవర్నర్ స్పెషల్ సెక్రటరీ
సిఎస్ మహంతిని గవర్నర్ స్పెషల్ సెక్రటరీ రమేష్ కలిసినట్లుగా తెలుస్తోంది.