ఎస్సై,కానిస్టేబుల్లపై కత్తితో సైకో దాడి, యువకుల హత్య
ఇదేమిటని ప్రశ్నిస్తే అతను కత్తితో దాడి చేశాడు. వారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు వచ్చి అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల పైనా అతను దాడికి తెగబడ్డాడు. కత్తితో దాడి చేయడంతో ఎస్సైకి, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేకపోవడం వల్లనే అతను దాడికి పాల్పడినట్లు చెప్పారు.
ఇద్దరు యువకుల దారుణ హత్య
కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడురు సమీపంలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వారిని రాజు, రవిలుగా గుర్తించారు. వారి గొంతుకోసి హతమార్చినట్లుగా గుర్తించారు.
వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతనిని గొంతుకోసి హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కొత్తపేట ఓ ఫ్యాక్టరీ వద్ద దినేష్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తితో పొడిచి హతమార్చారు.