ర్యాగింగ్ పేరిట వేధింపు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంకను కొద్ది రోజులుగా ఆమె సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక హాస్టల్ గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన స్నేహితులు, హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
అయితే ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కాగా ర్యాగింగ్కు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications