కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలులో రాహుల్ గాంధీ: సంజీవయ్యకు నివాళి, విద్యార్థులతో ముఖాముఖి

|
Google Oneindia TeluguNews

కర్నూలు/అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలులో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలుకు చేరుకున్నారు.

మీడియాకెక్కితే వేటే! పొత్తులు, సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్మీడియాకెక్కితే వేటే! పొత్తులు, సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్

కర్నూలులోని పెదపాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Rahul Gandhi pays tribute to former Andhra Pradesh CM Damodaram Sanjivayya

మంగళవారం మధ్యాహ్నం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. పార్టీ నేతలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

రాహుల్ రాకతో ఏపీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తునకర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో 'నేను కర్నూలులో ఉన్నాను' అంటూ తన షెడ్యూల్‌ను పోస్టు చేశారు.

English summary
All India Congress Committee (AICC) president Rahul Gandhi is set to visit Kurnool of Andhra Pradesh today (September 18) to participate in several programmes and also to address a public meeting. Rahul Gandhi is expected to take up farmer’s issue and special status to Andhra Pradesh, while the Rafale deal and unemployment are the other issues that the Congress chief is likely to address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X