కర్నూలులో రాహుల్ గాంధీ: సంజీవయ్యకు నివాళి, విద్యార్థులతో ముఖాముఖి
కర్నూలు/అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలులో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలుకు చేరుకున్నారు.
మీడియాకెక్కితే వేటే! పొత్తులు, సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్
కర్నూలులోని పెదపాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు.
I am in Kurnool, Andhra Pradesh today to meet with Congress party workers and leaders. Also scheduled are meetings with youth and farmers from the region. At 3 PM, I will address a public meeting at the STBC college ground. pic.twitter.com/7GETJapMSU
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2018
మంగళవారం మధ్యాహ్నం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. పార్టీ నేతలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
Congress President @RahulGandhi meets and interacts with residents of Peddapadu Village. #SwagathamRahulGandhi pic.twitter.com/2PMdks53Sk
— Congress (@INCIndia) September 18, 2018
రాహుల్ రాకతో ఏపీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తునకర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో 'నేను కర్నూలులో ఉన్నాను' అంటూ తన షెడ్యూల్ను పోస్టు చేశారు.