తిరుమలలో కుండపోత: భక్తుల ఇక్కట్లు
వరుస సెలవులు రావడంతో వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తిరుమలలో పొటెత్తారు..రద్దీ పెరగడంతో శ్రీవారి దర్శనానికి పదిగంటలకు పైగా సమయం పడుతొంది. దీనికి తోడు వార్థా తుఫాన్ ప్రభావంతో సోమవారం తెల్లవారిజామున 4 గంటల నుండి బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పటికే గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చలితీవ్రత ఎక్కువగా ఉన్న తిరుమలలో తుఫాన్ కారణంగా వాతవరణం మరింత చల్లబడిపోయింది. దీంతో శ్రీవారి భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షం వల్ల ఆలయ ప్రాంగణం, నాలుగు మాడావీధులు, దర్శనం క్యూలైన్లులలో భారీగా వర్షపు నీరు చేరింది.












Click it and Unblock the Notifications