తిరుమలలో ఒకేరోజు సప్త వాహనాలపై తిరుమలేశుడు.. ఎప్పుడంటే!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 25న రథసప్తమి పర్వదినం ఘనంగా జరగనుంది. మాఘ శుక్ల పక్ష సప్తమిని రథసప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. రథసప్తమిని సూర్య జయంతిగా కూడా చెబుతారు. ఈ రోజున జ్ఞాన ప్రదాత సూర్యదేవుడు జన్మించాడు. కనుక ఈ రోజున సూర్యుని జన్మదినాన్ని రథసప్తమి గా 'మినీ బ్రహ్మోత్సవాలు'గా నిర్వహిస్తారు.
రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు
ఈ క్రమంలో టీటీడీ భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి నాడు తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఆరోజు స్వామి వారు సప్త వాహనాల పైన ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక రథసప్తమి పర్వదినాన ఉదయం 5:30 నుండి ఎనిమిది గంటల వరకు (సూర్యోదయం 6:45 గంటలకు) స్వామివారిని సూర్యప్రభ వాహనం పైన ఊరేగిస్తారు.

స్వామివారికి వాహన సేవలు
9గంటల నుండి 10 గంటల వరకు స్వామివారిని చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు. 11గంటల నుండి 12 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకు హనుమంత వాహనంపై స్వామి వారు విహరిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుండి 3 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వామివారికి కల్పవృక్ష సేవ నిర్వహిస్తారు.
సప్తవాహనాలపై ఊరేగనున్న స్వామివారు
సాయంత్రం 6 గంటల నుండి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటలకు చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారు. మొత్తం రథసప్తమి నాడు సప్త వాహనాలపై ఊరేగి స్వామి వారు భక్తులను కరుణిస్తారు. తిరుమలలో రథసప్తమి కారణంగా స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
రథసప్తమికి టీటీడీ సూచనలు
సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహించనుంది. ఇక రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి వాహన సేవలను దృష్టిలో పెట్టుకొని భక్తులు తదనుగుణంగా ప్రణాళికలు చేసుకొని తిరుమలకు రావాలని టీటీడీ భక్తులకు సూచిస్తోంది.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications