కాంగ్రెసు బుజ్జగింపు: కిరణ్ రెడ్డికి రాయపాటి షాక్

కొత్త పార్టీలో చేరడంపై రాయపాటి తన మనసు మార్చుకున్నట్లు తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరే విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. మనసు మార్చుకోవడం వ్లలనే సోమవారం ప్రకటించిన జై సమైక్యాంధ్ర పార్టీ కమిటీలో రాయపాటి పేరు కనిపించలేదని అంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ గురించి ఆయనకంటే రాయపాటి సాంబశివ రావు ఎక్కువగా మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతున్నారంటూ పదే పదే చెబుతూ వచ్చారు. పార్టీ పెట్టే సమయానికి మాత్రం దూరంగా జరిగారు సన్నిహితులు, అనుచరుల ఒత్తిడి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని తొలుత భావించారు. రాయపాటి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో ఆ అవకాశాన్ని గల్లా జయదేవ్ తన్నుకుపోయారు. ఇక నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే టిడిపిలో చేరాలని, లేకుంటే తిరిగి కాంగ్రెస్ గూటికే చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాయపాటిని త్వరలోనే కాంగ్రెస్లోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం తెలంగాణకు చెందినన వి. హనుమంతరావు ద్వారా మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే రాయపాటి శిష్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాహుల్ని కలిసి, బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications