తండ్రి మణికుమార్ ట్విస్ట్, కంటతడి: రోహిత్ను చంపి ఉరేశారా?
విజయవాడ: హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) విద్యార్థి వేముల రోహిత్ మృతికి గుంటూరు జిల్లాకు చెందిన ఆయన తండ్రి వేముల మణికుమార్ కొత్త మలుపు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చదువుల్లో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న తన కుమారుడు రోహిత్ను ఉద్దేశపూర్వకంగా ఎవరో హతమార్చి ఉరివేసి ఉంటారని ఆయన ఆరోపించారు.
వడ్డెర కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రోహిత్ తండ్రి మణికుమార్ మంగళవారం విజయవాడ నగరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ తనతో పాటు మరో నలుగురితో కలిసి నిరాహారదీక్ష చేస్తుండగా వారిలో తన కుమారుడు ఒక్కడే శిబిరం నుంచి వెలుపలకు వెళ్లి గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
నిజానికితన కుమారుడు అంతటి పిరికివాడు కాదన్నారు. నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే సమస్య పరిష్కరించాలనే తపనతో పలువురి ఎదుటే నడిరోడ్డుపై పెట్రోలు పోసుకుని సజీవ దహనమయ్యేవాడని అన్నారు. తన కుమారుడి మనస్తత్వం ఏమిటో తనకు బాగా తెలుసునని ఆయన అన్నారు. వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోదలిస్తే మొత్తం ఐదుగురూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కదా అన్నారు.

పత్తా లేకుండా పోయారు..
సంఘటన అనంతరం సస్పెన్షన్లు ఎత్తివేయటంతో నలుగురూ పత్తాలేకుండా పోయారని ఆయన ఆరోపించారు. రోహిత్ శవం వున్నప్పుడు ఏ ఒక్క నాయకుడూ వచ్చి తమను పరామర్శించిన పాపాన పోలేదని, బూడిదైన తరువాత విమానంలో వచ్చి కంటతడి పెట్టటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రోహిత్ మరణాన్ని ఎవరికి వారు తమ రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలతో ఉద్యమాలకు వాడుకుంటున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రోహిత్ మరణంపై సిబిఐ విచారణ జరిపినప్పటికీ ప్రయోజనం వుండదని, ఆ సంస్థ ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి వత్తాసు పలుకుతుందన్నారు. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మణికుమార్ డిమాండ్ చేశారు. రోహిత్ రాసినట్టుగా చెబుతున్న లేఖలో పలు కొట్టివేతలుండటం మరింత అనుమానం కలిగిస్తుందన్నారు.

నా భార్య వాదన సరికాదు...
తన భార్య రాధిక దళితులుగా చెప్పుకుంటున్న వాదన సరైనది కాదని, ఆమె తల్లిదండ్రులు కూడా వడ్డెరలేనని, తల్లి గుంటూరులో మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయిని కాగా తండ్రి నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేసి ఇటీవల కాలంలో మరణించారని ఆయన చెప్పారు. తన భార్య అమాయకురాలని, అయితే తన అత్త మహా తెలివిగలదంటూ ఆమె ప్రోద్భలంతోనే ఎస్సీ సర్ట్ఫికెట్లు సృష్టించుకొని వుండవచ్చన్నారు.
మతం మార్చుకోకుండా కులం మార్చుకోవడంలో చాలా తెలివిగా ప్రవర్తించారని ప్రస్తుతం తాము బిసి-ఎ గ్రూపులో వుండగా అందుకే క్రైస్తవ మతం తీసుకుంటే బిసి-సిలోకి వెళ్లేవారని అందుకే ఏకంగా కులాన్నే మార్చుకోవటం జరిగి ఉండవచ్చునన్నారు.

ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితి
ఒకదశలో మణికుమార్ ఏమి మాట్లాడుతున్నాడో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. కుమారుడిని కోల్పోయానని బాధతో వున్నానని ఒకసారి, వాస్తవాలు తెలియాలి మినహా తనకెలాంటి ఆర్ధిక సహాయం వద్దని, ప్రభుత్వం ఆర్ధిక సహాయం ఇస్తే తీసుకుంటానని మరోసారి చెప్పారు.
విడాకులు ఇచ్చా...
పదేళ్ల క్రితం తమ భార్యాభర్తలు మధ్య వివాదాలు రాగా విడాకులు అడగ్గా ఆలోచించకుండా విడాకులు ఇచ్చానని, అయితే కొద్దికాలానికే పిల్లల కోసమంటూ తన దరిచేరగా విడాకులు చించిపారేసానని అప్పటి నుంచి ఇటీవల కాలం వరకు సహజీవనం సాగించానని చెప్పారు.
తనకు దూరంగా ఉంటున్నట్టు తన భార్య చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కొద్దిరోజుల వరకు కూడా తామిద్దరం కలిసి గుంటూరు సమీపంలో వెంగళాయపాలెంలో అద్దె ఇంట్లో నివసించామని చెప్పారు. ఎవరైనా వచ్చి విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. రెండు నెలల క్రితం భార్యాభర్తలను కలిసి రెండో కుమారుడికి పెళ్లి సంబంధాలు కూడా చూశామని అన్నారు. అయితే పెద్ద కొడుకు చదువు మినహా పెళ్లి వద్దని చెప్పటంతో రెండో కొడుక్కి పెళ్లి ఏర్పాటు చేసామని తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications