జగన్ సిఎం అయ్యేంత దాకా పెళ్లి చేసుకోను: యువకుడి శపథం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను పెళ్లి చేసుకోబోనని ఓ యువకుడు శపథం పట్టాడు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాళెం గ్రామానికి చెందిన రాయిపు రవీంద
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను పెళ్లి చేసుకోబోనని ఓ యువకుడు శపథం పట్టాడు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాళెం గ్రామానికి చెందిన రాయిపు రవీంద్ర అనే 27 ఏళ్ల యువకుడు ఆ శపథం చేశాడు.
అతను పీజీ పూర్తి చేశాడు. ఆదివారంనాడు రాయిపు రవీంద్రకు తన బంధువుల అమ్మాయితో గ్రామంలో పెళ్లిచూపులు జరిగాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో ఫీజు రీయంబర్స్మెంట్ వల్ల తాను పీజీ చేశానని ఆయన చెప్పాడు.
నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 2015లో ఎంకాం పూర్తి చేశానని, గత మూడేళ్లుగా తనకు ప్రభుత్వంలో ఉద్యోగం రాలేదని ఆయన చెప్పాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి ఉన్న ఉద్యోగాలను తీసేస్తోందని విమర్సించాడు.
ఉద్యోగాలు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని రవీంద్ర దైవం సాక్షిగా ప్రమాణం చేశాడు.