ఏం చేయలేను, ఇదీ నా పరిస్థితి: జగన్కు అలా చెప్పి తప్పించుకున్న రేణుక!
కర్నూలు పార్లమెంటు సభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుక రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా పత్రం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
Recommended Video
కర్నూలు: కర్నూలు పార్లమెంటు సభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుక రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా పత్రం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
కర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరు
బుట్టా రేణుక వైసిపిని వదిలి టిడిపిలోకి వెళ్తుందనే విషయం తెలిసి వైసిపి అధినేత వైయస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. అయితే స్వయంగా జగన్ మాట్లాడినా ఆమె ఏమాత్రం తగ్గలేదనే విషయం తెలిసిందే.
'ఇవీ జగన్ విలువలు, బుట్టా రేణుక మోసపోవద్దు, పాదయాత్రపై బాబు బడా మైండ్గేమ్'
తన నిస్సహాయస్థితి చెప్పిన బుట్టా రేణుక
పార్టీ మారవద్దని జగన్ అడిగితే.. ఆమె తన గోడును వెళ్లగక్కారని తెలుస్తోంది. పార్టీని వీడొద్దని, భవిష్యత్తు వైసిపిదేనని జగన్ ఆమెతో చెప్పారు. దీంతో అమె తన నిస్సహాయ పరిస్థితిని వెల్లడించారని తెలుస్తోంది. తాను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆమె వెల్లడించారట.
కార్యకర్తల ఒత్తిడి వల్లే
అంతేకాదు, పార్టీ మారే అంశాన్ని బుట్టా రేణుక కార్యకర్తల పైకి నెట్టి వేసిందని తెలుస్తోంది.ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడితోనే అని ఆమె అధినేతకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
2014 కంటే భిన్నమైన పరిస్థితి
అదే సమయంలో ఆమె కర్నూలు జిల్లాలో 2014 కంటే ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉందని, పైగా కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, 2019లో తిరిగి గెలవాలంటే పార్టీ మారక తప్పని పరిస్థితి అని బుట్టా రేణుక జగన్తో చెప్పారని అంటున్నారు.
వరుసగా వైసిపిని వీడుతుండటంతో..
కర్నూలు జిల్లాలో వైసిపికి వరుస దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. తొలుత ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరారు. ఆ తర్వాత భూమా నగిరెడ్డి, అఖిలప్రియ, ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి, మణిగాంధిలు అధికార పార్టీ వైపు వచ్చారు. ఇప్పుడు బుట్టా రేణుక అదే దారిలో నడుస్తున్నారు. కర్నూలులో విపక్షం బలహీనమవుతుందని భావించడం వల్లే కార్యకర్తలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేరు వినిపిస్తోంది.