వైసిపి శిల్పా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చక్రపాణి రెడ్డి ప్రచారం!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు!
ఆయన శనివారం నంద్యాల పట్టణంలోని తన కార్యాలయంలో బండి ఆత్మకూరు మండలంలోని 25 మసీదులకు ఒక్కొక్క మసీదుకు మరమ్మతుకుగాను ప్రభుత్వం మంజూరు చేసిన రూ.9500 చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం హయాంలోనే గ్రామాల్లో మసీదులకు నిధులు మంజూరు చేశారన్నారు. మౌజన్లకు, ఇమాములకు గౌరవ వేతనం ఇచ్చింది కూడా టిడిపియే అన్నారు.
మండలంలోని 110 మందికి ఇమాముల, మౌజన్లకు గౌరవ వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా మసీదుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
ఈద్గాలకు, మసీదులకు, శ్మాశన వాటికలకు ప్రహరీలు, గ్రామాల్లో అవసరమైతే తమ దృష్టికి తెస్తే నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications