ఆ సత్తా సోనియాకే ఉంది: వెంకయ్య ప్రశంస, తప్పుదోవ: కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఏకీకృతం చేసే సత్తా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే ఉందని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అన్నారు. ఆమె లేకుంటే కాంగ్రెస్ పార్టీ పతనమై ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అధ్యక్ష పదవి అంశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహామని, తమకు సంబంధం లేదన్నారు. సోనియా వల్లే కాంగ్రెస్ పార్టీ ఏకీకృతంగా ఉందనేది తన అభిప్రాయమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వారసత్వం అనేది అనవసరమన్నారు. కాంగ్రెస్తో పాటు ఆ పార్టీ మద్దతుదారులకే వారసత్వం నచ్చుతుందన్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు: కిషోర్ చంద్రదేవ్
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన వైఫల్యాల పైన సొంత పార్టీలోనే నిరసన గళం పెరుగుతోంది. అధిష్టానాన్ని కొందరు సీనియర్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత కిషోర్ చంద్రదేవ్ విమర్శించారు.
అలాంటి డజను మంది సీనియర్ నేతలను సెలవుల పైన పంపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరగా నిర్ణయం తీసుకోకుంటే ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పెరిగే అవకాశముందన్నారు. లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసి రెండేళ్లు గడుస్తున్నా పార్టీలో మార్పు లేదన్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications