30 కెమెరాలతో ఇంటి వద్ద నిఘా: ముద్రగడకు ఎస్పీ మరో షాక్, కడపకు ర్యాలీ.. రామానుజయ అరెస్ట్
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఎస్పీ షాకిచ్చారు. ముద్రగడ హౌస్ అరెస్ట్ 48 గంటలకే పరిమితం కాదని, పొడిగించవచ్చునని చెప్పారు. ముద్రగడ ఇంటి వద్ద 30 కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు.
ముద్రగడ యాత్రలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశముందనే సమాచారంతోనే హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు సూచనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. గృహ నిర్బంధాన్ని పొడిగించవచ్చునని అన్నారు. ముద్రగడ ర్యాలీకి అనుమతి లేదన్నారు. లిఖితపూర్వకంగా రాసిస్తే పరిశీలిస్తామని చెప్పారు.

కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ అరెస్ట్
కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయతో పాటు మరో 24 మందిని మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పోటీగా బుధవారం ఇడుపులపాయ నుంచి కడప జిల్లాకు పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా విజయవాడ నుంచి 30 వాహనాలలో తన అనుచరులతో కలిసి బయలుదేరారు. అయితే, రామానుజయ కాన్వాయ్ని పోలీసులు కాజ టోల్ గేటు వద్ద అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ ఆయనతో పాటు మరో 24 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం వారిని స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications