నెల్లూరు జిల్లాలో కాటేసిన కల్తీ మద్యం...ఇద్దరి మృతి:కలకలం
నెల్లూరు:నెల్లూరు జిల్లాలో కల్తీ మద్యం ఇద్దరి ఉసురు తీసింది. మద్యం తాగిన కొంతసేపటికే ఇరువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతులను భాషా, షకీర్గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా దామరమడుగుకు చెందిన ఖాదర్ బాషా, షాకీర్లు ఆత్మకూరులో జరిగిన పెళ్లి వేడుకకు గుర్రాన్ని తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాగులపాడులోని మద్యం దుకాణంలో వీరు మద్యాన్ని కొనుగోలు చేసి ఇంటికి వచ్చి తాగారు. ఆ తరువాత కొద్దిసేపటికే వీరిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

అయితే కల్తీ మద్యం కారణంగానే వీరిద్దరూ మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications